చింత చిగురు బిర్యాని

- February 15, 2016 , by Maagulf
చింత చిగురు బిర్యాని

కావలసిన పదార్థాలు: బాసుమతి బియ్యం - ఒకటిన్నర కప్పులు, చింతచిగురు - అరకప్పు, ఉల్లి తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి - 5, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి - 6 రేకలు, పచ్చికొబ్బరి ముక్క - పావు చిప్ప, సోంపు - 1 టీ స్పూను, జీలకర్ర - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్‌ స్పూను, మసాలా దినుసులు (లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యాని ఆకు) - తగినన్ని.

తయారుచేసే విధానం: శుభ్రం చేసిన చిగురుని టీ స్పూను నూనెలో దోరగా వేగించి, కొద్ది నీటిలో ఉడికించి పక్కన పెట్టాలి. మిక్సీలో పావుకప్పు ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, సోంపు, అర టీ స్పూను జీలకర్ర మెత్తగా రుబ్బుకోవాలి. నూనెలో మసాలా దినుసులు, మిగిలిన జీలకర్ర, ఉల్లి తరుగు, ఉల్లి మిశ్రమం ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. ఉల్లి ముద్ద పచ్చివాసన పోయాక చింతచిగురు కలపాలి. రెండు నిమిషాల తర్వాత (3 గంటలు నానబెట్టిన) బియ్యం కలిపి రెండున్నర కప్పుల నీరు పోసి ఉడికించాలి. అన్నంతో కలిసిన చింతచిగురు రుచికరమైన బిర్యానిగా సిద్ధమపోతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com