ఖమ్మం నగరంలో మరో 3 వేల ఇళ్లు మంజూరు: తెలంగాణ ముఖ్యమంత్రి
- February 15, 2016
ఖమ్మం నగరంలో పెద్దసంఖ్యలో పేద ప్రజలు ఉన్నారని.. వారి కోసం ఇళ్లు కట్టేందుకు దాదాపు 300 ఎకరాల భూమి అందుబాటులో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ఖమ్మం నగరంలో ఇప్పటికే 2 వేల ఇళ్లు మంజూరు చేశామని, మరో 3 వేల ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. 2 పడక గదుల ఇళ్ల కోసం దాదాపు 5 కిలోమీటర్ల దూరంలోపే స్థలం ఉందని పేర్కొన్నారు. ఖమ్మంలో మార్కెట్లు, డంపింగ్యార్డులు ఉండాల్సిన సంఖ్యలో లేవన్నారు. కనీసం 50 వేల మందికి ఒక మార్కెట్ ఉండాలన్నారు. నగరంలో అధునాతన బస్ ప్రాంగణం నిర్మిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్యూవీల రీకాల్..!!
- ఇరాన్తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్లోని ఫిలిప్పీన్స్ బేకర్కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు







