ఖమ్మం నగరంలో మరో 3 వేల ఇళ్లు మంజూరు: తెలంగాణ ముఖ్యమంత్రి

- February 15, 2016 , by Maagulf
ఖమ్మం నగరంలో మరో 3 వేల ఇళ్లు మంజూరు: తెలంగాణ ముఖ్యమంత్రి

ఖమ్మం నగరంలో పెద్దసంఖ్యలో పేద ప్రజలు ఉన్నారని.. వారి కోసం ఇళ్లు కట్టేందుకు దాదాపు 300 ఎకరాల భూమి అందుబాటులో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ఖమ్మం నగరంలో ఇప్పటికే 2 వేల ఇళ్లు మంజూరు చేశామని, మరో 3 వేల ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. 2 పడక గదుల ఇళ్ల కోసం దాదాపు 5 కిలోమీటర్ల దూరంలోపే స్థలం ఉందని పేర్కొన్నారు. ఖమ్మంలో మార్కెట్లు, డంపింగ్‌యార్డులు ఉండాల్సిన సంఖ్యలో లేవన్నారు. కనీసం 50 వేల మందికి ఒక మార్కెట్‌ ఉండాలన్నారు. నగరంలో అధునాతన బస్‌ ప్రాంగణం నిర్మిస్తామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com