ఐఫోన్ వినియోగదారులు వెంటనే వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాలని యూఏఈ సూచన

- November 06, 2020 , by Maagulf
ఐఫోన్ వినియోగదారులు వెంటనే వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాలని యూఏఈ సూచన

యూఏఈ:మీరు ఆపిల్ ఐఫోన్ వాడుతున్నారా..? ఐతే మీ మొబైల్ లోని వాట్సాప్ ను వెంటనే అప్ డేట్ చేసుకోండి.! లేదంటే మీ ఫోన్ లోని డేటా క్రాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ యూఏఈ ప్రభుత్వం హెచ్చరించింది. సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ నుంచి సురక్షితంగా ఉండాలంటే వాట్సాప్ లేటెస్ట్ వర్షన్ ను వెంటనే అప్ డేట్ చేసుకోవాలని యూఏఈ టెలి కమ్యూనికేషన్ రెగ్యూలేటరీ ఆథారిటీ సూచించింది. ప్రస్తుతం ఉన్న వాట్సాప్ వర్షన్ ద్వారా వైరస్ యాక్సెస్ కు అవకాశాలు ఉన్నాయని, దీంతో మొబైల్ డేటా క్రాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఫోన్ లాక్ ఉన్న సమయంలోనూ వైరస్ అటాక్ చేసేందుకు ఆస్కారం ఉందని  ట్రాయ్ తెలిపింది. ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు వాట్సాప్ లేటెస్ట్ వర్షన్ ను వెంటనే అప్ డేట్ చేసుకోవాలని ట్రాయ్ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com