సౌదీ: హద్దు దాటిన వాహనదారులకు ఇక వాయింపే..
- November 06, 2020
సౌదీ అరేబియా:నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేసే వాహనదారులను కట్టడి చేసేందుకు త్వరలోనే ఆటోమేటిక్ మానిటరింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది సౌదీ ప్రభుత్వం. ఇక రోడ్లపై ముందస్తు సిగ్నల్ ఇవ్వకుండా ఇస్టానుసారంగా లేన్లు మార్చుతూ డ్రైవింగ్ చేసే వాహనాలను ఈ ఆటోమేటిక్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పసిగట్టవచ్చు. ఈ సిస్టంను ముందుగా రియాద్, దమ్మమ్, జెడ్డా నగరాల్లో అమలు చేయనున్నారు. వచ్చే వారం రోజుల్లోనే మానిటరింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దీంతో వాహనాల కదలికలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. రహదారులపై ప్రమాదాల నియంత్రణను దృష్టిలో పెట్టుకొని ఆటోమేటిక్ మానిటరింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









