ఒమన్-భారత్ మధ్య విమాన ప్రయాణికుల సంఖ్యలో కోత..
- November 10, 2020
మస్కట్:భారత్-భారత్ మధ్య ప్రయాణికుల సంఖ్యలో భారీ కోత పడింది. విమానాల్లో సీట్ల లభ్యత సగానికి సగం తగ్గనుంది. ఈ మేరకు ఒమన్-భారత్ మధ్య జరిగిన ఎయిర్ బబుల్ ఒప్పందంలో సవరణలు జరిగాయి. ఈ సవరణల ప్రకారం భారత్-ఒమన్ మధ్య ఇక నుంచి వారానికి 5 వేల మంది ప్రయాణికులకే అనుమతి ఇస్తారు. అంటే ఒక వారంలో ఒమన్ నుంచి భారత్ కు ప్రయాణించే వారి సంఖ్య...భారత్ నుంచి ఒమన్ కు ప్రయాణించే వారి సంఖ్య గరిష్టంగా 5 వేల మందికి మాత్రమే పరిమితం కానుంది. రెండు దేశాల ఎయిర్ వేస్ లను కలుపుకుంటే 10 వేల మంది వరకు ప్రయాణానికి అనుమతి ఉంటుంది. భారత్ నుంచి ఒమన్ కు ప్రయాణించిన కొందరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ కావటంతో ఒమన్ ప్రభుత్వం ఈ సవరణలను ప్రతిపాదించింది. ఈ మేరకు గత నెల 29న ఒమన్ పౌర విమానయాన అధికార విభాగం..భారత్ కు లేఖ రాసింది. నవంబర్ 9 నుంచి ఎయిర్ బబుల్ ఒప్పందంలో సవరణలు అమలు చేయాలని కోరుతూ..వారానికి 5000 సీట్లనే అనుమతించాలని అభ్యర్ధించింది. అయితే..ఏయే ఎయిర్ వేస్ కు ఎన్ని సీట్లు ఇస్తారనేది భారతీయ అధికారుల ఆధ్వర్యంలో తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు...ప్రభుత్వ రంగ విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ కు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ సంస్థలు ఒమన్ కు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఇటీవలె ప్రకటించిన విషయం తెలిసిందే.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







