నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- July 07, 2026
దుబాయ్: ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ పేరుతో నకిలీ వెబ్సైట్లు, అనుమానాస్పద లింక్ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు నటిస్తూ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దోచుకుని ఖాతాల్లోని డబ్బును అపహరిస్తున్నారని తెలిపారు.
దుబాయ్ పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డిపార్ట్మెంట్కు చెందిన యాంటీ-ఫ్రాడ్ సెంటర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఫిర్యాదు చేయాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ వెబ్సైట్ కోసం వెతికే వారిని నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లకు మళ్లిస్తున్నారు. అక్కడ బాధితుల పేరు, ఇ-మెయిల్, ఫోన్ నంబర్, ఫిర్యాదు వివరాలు నమోదు చేయించుకుంటారు.
ఆ తర్వాత కన్స్యూమర్ ప్రొటెక్షన్ అధికారులమని చెప్పుకుంటూ బాధితులకు ఫోన్ చేసి, వారు నమోదు చేసిన ఫిర్యాదు వివరాలను ప్రస్తావిస్తూ నమ్మకం కల్పిస్తారు. అనంతరం సమస్య పరిష్కారం పేరుతో రిమోట్ యాక్సెస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలని సూచిస్తారు.
బాధితులు ఆ యాప్ను ఇన్స్టాల్ చేసి తమ ఆన్లైన్ బ్యాంకింగ్ ఖాతాలో లాగిన్ అయిన వెంటనే, నేరగాళ్లు వారి మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం పొందుతారు. దీంతో గోప్యమైన బ్యాంకింగ్ సమాచారం సేకరించి ఖాతాల్లోని డబ్బును బదిలీ చేయడం లేదా అనధికారిక కొనుగోళ్లు నిర్వహించడం జరుగుతోందని పోలీసులు వివరించారు.
ఈ రిమోట్ యాక్సెస్ ప్రోగ్రామ్లు బాధితుల పరికరాలను పూర్తిగా నియంత్రించే సామర్థ్యం కలిగి ఉండటంతో, వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు సులభంగా సైబర్ నేరగాళ్ల చేతికి చేరుతున్నాయని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు.
ప్రజలు ఫిర్యాదులు నమోదు చేసేటప్పుడు అధికారిక కన్స్యూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్లు, అధికారిక ఛానెల్లను మాత్రమే ఉపయోగించాలని, తెలియని వ్యక్తులతో బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు లేదా ఇతర గోప్య సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు.
ఇలాంటి మోసపూరిత ప్రయత్నాలు ఎదురైతే వెంటనే eCrime ప్లాట్ఫారమ్ ద్వారా లేదా 901 హెల్ప్లైన్కు సమాచారం అందించాలని దుబాయ్ పోలీసుల యాంటీ-ఫ్రాడ్ సెంటర్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







