ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ తెలంగాణ కీలక ప్రకటన

- November 10, 2020 , by Maagulf
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ తెలంగాణ కీలక ప్రకటన

ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు వంటివి చెల్లించడంలో 100 శాతం మినహాయింపు ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.  2030 వరకు గాను ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 

మొదటి 2 లక్షల ద్విచక్ర వాహనాలు, 20,000 త్రీ వీలర్లు, 20,000 వాణిజ్య వినియోగ వాహనాలు మరియు 500 బస్సులకు రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇవ్వబడుతుందని ప్రకటించింది. 

అలాగే, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు కూడా రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో కొనుగోలు చేసి నమోదు చేసుకున్న వాహనాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com