కాజల్ బిజినెస్ ప్లాన్..మహిళల కోసం ప్రత్యేక గేమ్స్
- November 10, 2020
ముంబై: పెళ్లయి హనీమూన్ లో భర్త కిచ్లూతో ఎంజాయ్ చేస్తున్న సినీ నటి కాజల్ అగర్వాల్.. అప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేసింది. తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ముంబైకి చెందిన ఓకే (okie) గేమింగ్ కంపెనీలో 15 శాతం వాటాలు కొనుగోలు చేసింది. దీని కోసం ఎంత మొత్తం చెల్లించిందనేది తెలియరాలేదు. కరోనా నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మొబైల్.. ఎలక్ర్టానిక్ గాడ్జెట్స్ ఉపయోగం శరవేగంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే యూజర్లు పెరుగుతుండడంతో గేమింగ్ పరిశ్రమ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతోంది. సినిమాలకు దాదాపు గుడ్ బై చెప్పిన కాజల్ అగర్వాల్.. సెకండ్ ఇన్నింగ్స్ గా బిజినెస్ ను ఆప్షన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలక్ర్టానిక్.. డిజిటల్.. గేమింగ్ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి సాధిస్తుండడంతో ఇదే మంచి అవకాశంగా కాజల్ భావించి వాటాలు కొన్నట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త కిచ్లూను పెళ్లి చేసుకున్న కాజల్ పెళ్లయ్యాక తొలి అడుగుగా గేమింగ్ కంపెనీలో వాటాలు కొనేసింది. ప్రాంతీయ గేమ్స్ తో మార్కెట్లోకి దిగిన ఓకే ప్లాట్ ఫాం ద్వారా కాజల్ మహిళల కోసం ప్రత్యేక గేమ్స్ అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







