సెలెక్టర్లు కావలెను..BCCI ప్రకటన
- November 11, 2020
న్యూ ఢిల్లీ:సీనియర్ సెలెక్షన్ కమిటీలో త్వరలో ఖాళీ అవుతున్న సెలెక్టర్లను భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులకు ఈనెల 15 ఆఖరి తేదీ అని ప్రకటనలో పేర్కొంది. కమిటీలోని దేవాంగ్ గాంధీ (ఈస్ట్జోన్), శరణ్దీప్ సింగ్ (నార్త్జోన్), జతిన్ పరాంజన్ (వెస్ట్జోన్) ల పదవీ కాలం ఇదివరకే ముగిసినా.. ఆసిన్ పర్యటన కోసం జట్లను ఎంపిక చేసేందుకు పొడిగింపు ఇచ్చింది. జట్ల ఎంపిక పూర్తి కావడంతో ఇక సెలెక్టర్ల భర్తీపై బోర్డు దృష్టిసారించింది. ఇప్పటికే సౌత్జోన్ నుంచి ఖాళీ అయిన ఎమ్మెస్కే ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) స్థానంలో సునీలో జోషి (కర్ణాటక), సెంట్రల్ జోన్లో గగన్ ఖోడా స్థానంలో హర్వీందర్ సింగ్లను నియమించింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







