షార్జాలో బలవన్మరణానికి పాల్పడ్డ భారతీయ ఇంజనీరింగ్ విద్యార్థి
- November 11, 2020
షార్జా: ఓ ఇండియన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ బలవన్మరణానికి పాల్పడటంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. మృతుడ్ని జ్యోత్గా గుర్తించారు. అల్ రోల్లాలోని ఓ అపార్ట్మెంట్లో జ్యోత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ప్రస్తుతానికి ఎలాంటి అనుమానాలూ లేవనీ, జ్యోత్ బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించామనీ, విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు. మృతుడి సోదరుడు నిరాల్ మాట్లాడుతూ, జ్యోత్ మరణాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చెమర్చిన కళ్ళతో చెప్పాడు. కంప్యూటర్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు మృతుడు జ్యోత్. స్టడీస్లో ఉన్నతంగా రాణించేవాడనీ, ఎందుకు ప్రాణాలు తీసుకున్నాడో అర్థం కావడంలేదని మృతుడి ఫ్రెంట్స్ చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









