షార్జాలో బలవన్మరణానికి పాల్పడ్డ భారతీయ ఇంజనీరింగ్ విద్యార్థి
- November 11, 2020
షార్జా: ఓ ఇండియన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ బలవన్మరణానికి పాల్పడటంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. మృతుడ్ని జ్యోత్గా గుర్తించారు. అల్ రోల్లాలోని ఓ అపార్ట్మెంట్లో జ్యోత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ప్రస్తుతానికి ఎలాంటి అనుమానాలూ లేవనీ, జ్యోత్ బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించామనీ, విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు. మృతుడి సోదరుడు నిరాల్ మాట్లాడుతూ, జ్యోత్ మరణాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చెమర్చిన కళ్ళతో చెప్పాడు. కంప్యూటర్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు మృతుడు జ్యోత్. స్టడీస్లో ఉన్నతంగా రాణించేవాడనీ, ఎందుకు ప్రాణాలు తీసుకున్నాడో అర్థం కావడంలేదని మృతుడి ఫ్రెంట్స్ చెబుతున్నారు.
తాజా వార్తలు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!









