ఖతార్ లో కొత్తగా 224 కోవిడ్ కేసులు...వైరస్ సోకిన వారిలో 57 మంది ప్రయాణికులు

- November 11, 2020 , by Maagulf
ఖతార్ లో కొత్తగా 224 కోవిడ్ కేసులు...వైరస్ సోకిన వారిలో 57 మంది ప్రయాణికులు

ఖతార్ లో కొత్తగా 224 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కొత్త నమోదైన కేసులో 176 కమ్యూనిటీ కేసులు కాగా..57 మంది ప్రయాణికులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,34,887 మంది వైరస్ బారిన పడగా..2,728 మందికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించింది.  మరోవైపు 24 గంటల వ్యవధిలోనే 193 మంది వైరస్ నుంచి కోలుకోగా..ఇప్పటివరకు 1,31,926 మంది కరోనా నుంచి రికవరి అయ్యారు. మరోవైపు వైరస్ ప్రబలిన నాటి నుంచి ఇప్పటివరకు ఖతార్ వ్యాప్తంగా 233 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 5,288 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇంత పెద్ద సంఖ్యలో టెస్టులు నిర్వహించచటం ఇదే తొలిసారి కావటం విశేషం.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com