ప్రవాసీయుల కుటుంబ సభ్యుల వేలి ముద్రలు నమోదు చేయించాలని సౌదీ ఆదేశం

- November 11, 2020 , by Maagulf
ప్రవాసీయుల కుటుంబ సభ్యుల వేలి ముద్రలు నమోదు చేయించాలని సౌదీ ఆదేశం

సౌదీ: ప్రవాసీయుల కుటుంబాలకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసింది సౌదీ అరేబియా ప్రభుత్వం. కింగ్డమ్ పరిధిలోని ప్రవాసీయులు అంతా తమ కుటుంబ సభ్యుల వేలి ముద్రలను నమోదు చేయించాలని  ఆదేశించింది. భద్రతపరమైన కారణాలు, నివాస అనుమతులకు సంబంధించి వేలిముద్రలను సేకరిస్తున్నట్లు సౌదీ పాస్ పోర్టు డైరెక్టర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. ప్రవాసీయుల కుటుంబంలో ఆరేళ్ల వయసుకు మించి ఉన్న వాళ్లందరి వేలి ముద్రలను తప్పనిసరిగా నమోదు చేయించాలని సూచించింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో 34.8 మిలియన్ల జనాభా ఉంటే..అందులో 10.5 మిలియన్ల జనాభా విదేశాలకు చెందిన వారే కావటం గమనార్హం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com