ప్రవాసీయుల కుటుంబ సభ్యుల వేలి ముద్రలు నమోదు చేయించాలని సౌదీ ఆదేశం
- November 11, 2020
సౌదీ: ప్రవాసీయుల కుటుంబాలకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసింది సౌదీ అరేబియా ప్రభుత్వం. కింగ్డమ్ పరిధిలోని ప్రవాసీయులు అంతా తమ కుటుంబ సభ్యుల వేలి ముద్రలను నమోదు చేయించాలని ఆదేశించింది. భద్రతపరమైన కారణాలు, నివాస అనుమతులకు సంబంధించి వేలిముద్రలను సేకరిస్తున్నట్లు సౌదీ పాస్ పోర్టు డైరెక్టర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. ప్రవాసీయుల కుటుంబంలో ఆరేళ్ల వయసుకు మించి ఉన్న వాళ్లందరి వేలి ముద్రలను తప్పనిసరిగా నమోదు చేయించాలని సూచించింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో 34.8 మిలియన్ల జనాభా ఉంటే..అందులో 10.5 మిలియన్ల జనాభా విదేశాలకు చెందిన వారే కావటం గమనార్హం.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









