మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న కర్రి బాలాజీ బ్యాక్ డోర్
- November 11, 2020
హైదరాబాద్:యువ ప్రతిభాశాలి-నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ ‘బ్యాక్ డోర్’ పేరుతో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ కథానాయకి పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ విభిన్న కథా చిత్రాన్ని.. ‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్’ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ..”బ్యాక్ డోర్” ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ వినూత్న చిత్రం హీరోయిన్ పూర్ణ కెరీర్ లో ఓ మైలు రాయిలా నిలిచిపోతుంది. మా నిర్మాత శ్రీనివాస్ రెడ్డిగారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. యూనిట్ మెంబర్స్ అందరి సహకారంతో మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది” అని అన్నారు.
‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్’ అధినేత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… ‘మా దర్శకుడు బాలాజీ కంప్లీట్ క్లారిటీతో షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రం దర్శకుడిగా బాలాజీకి చాలా మంచి పేరు తెస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి మంచి బాలాజీ అవుట్ పుట్ రాబట్టుకుంటున్నారు” అని వివరించారు.
హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. “డైరెక్టర్ బాలాజీ అద్భుత ప్రతిభకు అద్దం పట్టే చిత్రమిది. నిర్మాతకు రివార్డులు, దర్శకుడికి అవార్డులు తెచ్చిపెట్టడం ఖాయం. నా కెరీర్ లోనూ చాలా మంచి సినిమాగా నిలుస్తుంది” అని అన్నారు.
ఈ చిత్రానికి మేకప్: మోహన్, కాస్ట్యూమ్స్: శ్రీనివాస్, మేనేజర్: అంజి, ప్రొడక్షన్: శ్యామ్, స్టిల్స్: శ్రీనివాస్ విల్లా, కెమెరా & లైట్స్: ఓంకార్ యూనిట్, అసిస్టెంట్ డైరెక్టర్: సాదిక్, అసోసియేట్ డైరెక్టర్: రవి రోహిత్,
కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్: రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల, చాందిని, సంగీతం: ప్రణవ్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్,
కెమెరా: శ్రీకాంత్ నారోజ్,
పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ,
కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను,
నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







