జెడ్డా సిమిటెరీ ఎటాక్లో గాయపడ్డవారిని ప్రిన్స్ మిషాల్ పరామర్శ
- November 12, 2020
జెడ్డా: జెడ్డా గవర్నర్ ప్రిన్స్ మిషాల్ బిన్ మాజెద్, జెడ్డా సిమిటరీ ఎటాక్లో గాయపడ్డవారిని పరామర్శించారు. చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న ప్రిన్స్ మిషాల్, వైద్య చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మక్కా రీజియన్ పోలీస్ డైరెక్టర్ మేజర్ జనరల్ ఈద్ అల్ ఒతైబి, పలు గవర్నరేట్లకు చెందిన అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెడ్డాలోని ఓ నాన్ ముస్లిం సిమిటరీలో బాంబు పేలుడు సంభవించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులకు నివాళులర్పించేందుకు పలు విదేశీ ఎంబసీలు చేపట్టిన కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. అందులో ఒకరు గ్రీక్ కాన్సులేట్ మెంబర్ కాగా, మరొకరు సౌదీ సెక్యూరిటీ గార్డ్.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







