జెడ్డా సిమిటెరీ ఎటాక్లో గాయపడ్డవారిని ప్రిన్స్ మిషాల్ పరామర్శ
- November 12, 2020
జెడ్డా: జెడ్డా గవర్నర్ ప్రిన్స్ మిషాల్ బిన్ మాజెద్, జెడ్డా సిమిటరీ ఎటాక్లో గాయపడ్డవారిని పరామర్శించారు. చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న ప్రిన్స్ మిషాల్, వైద్య చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మక్కా రీజియన్ పోలీస్ డైరెక్టర్ మేజర్ జనరల్ ఈద్ అల్ ఒతైబి, పలు గవర్నరేట్లకు చెందిన అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెడ్డాలోని ఓ నాన్ ముస్లిం సిమిటరీలో బాంబు పేలుడు సంభవించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులకు నివాళులర్పించేందుకు పలు విదేశీ ఎంబసీలు చేపట్టిన కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. అందులో ఒకరు గ్రీక్ కాన్సులేట్ మెంబర్ కాగా, మరొకరు సౌదీ సెక్యూరిటీ గార్డ్.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







