జెడ్డా సిమిటెరీ ఎటాక్లో గాయపడ్డవారిని ప్రిన్స్ మిషాల్ పరామర్శ
- November 12, 2020
జెడ్డా: జెడ్డా గవర్నర్ ప్రిన్స్ మిషాల్ బిన్ మాజెద్, జెడ్డా సిమిటరీ ఎటాక్లో గాయపడ్డవారిని పరామర్శించారు. చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న ప్రిన్స్ మిషాల్, వైద్య చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మక్కా రీజియన్ పోలీస్ డైరెక్టర్ మేజర్ జనరల్ ఈద్ అల్ ఒతైబి, పలు గవర్నరేట్లకు చెందిన అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెడ్డాలోని ఓ నాన్ ముస్లిం సిమిటరీలో బాంబు పేలుడు సంభవించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులకు నివాళులర్పించేందుకు పలు విదేశీ ఎంబసీలు చేపట్టిన కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. అందులో ఒకరు గ్రీక్ కాన్సులేట్ మెంబర్ కాగా, మరొకరు సౌదీ సెక్యూరిటీ గార్డ్.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!