నేషనల్ డే, క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై కోవిడ్ ఎఫెక్ట్..ఆంక్షలు విధించిన యూఏఈ
- November 18, 2020
యూఏఈ: కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పు బయపెడుతున్న ప్రస్తుత పరిస్థితులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని యూఏఈ ప్రభుత్వం సూచించింది. రాబోయే రోజుల్లో యూఏఈ నేషనల్ డేతో పాటు క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి బిగ్ ఈవెంట్ డేస్ వస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం. నేషనల్ డే, క్రిస్మస్, న్యూ ఇయర్ రోజుల్లో ప్రజలు ఎవరూ బయట గుమికూడొద్దని, గతంలో మాదిరిగా వీధుల్లో కలియతిరుగుతూ సందడి చేసేందుకు ఈ సారి అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రజలు ఒక చోట చేసి సంబరాలు చేసుకోవటం..బహుమతులు పంచుకోవటం మానుకోవాలని తెలిపింది. వీలైనంత వరకు వర్చువల్ గానే శుభాకాంక్షలు తెలుపుకోవాలని సూచించింది. బహిరంగ ప్రాంతాలకు రావాల్సి వస్తే ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు రెండు మీటర్ల ఎడం పాటించాలని తెలిపింది. ఇక మూడు నాలుగు గంటలకు మించి జరిగే ఈవెంట్లకు ఖచ్చితంగా సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని, ఈవెంట్ల నిర్వహణలో కోవిడ్ నిబంధనలను అన్నింటిని ఖచ్చితంగా పాటించి తీరాలని ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









