నేషనల్ డే, క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై కోవిడ్ ఎఫెక్ట్..ఆంక్షలు విధించిన యూఏఈ
- November 18, 2020
యూఏఈ: కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పు బయపెడుతున్న ప్రస్తుత పరిస్థితులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని యూఏఈ ప్రభుత్వం సూచించింది. రాబోయే రోజుల్లో యూఏఈ నేషనల్ డేతో పాటు క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి బిగ్ ఈవెంట్ డేస్ వస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం. నేషనల్ డే, క్రిస్మస్, న్యూ ఇయర్ రోజుల్లో ప్రజలు ఎవరూ బయట గుమికూడొద్దని, గతంలో మాదిరిగా వీధుల్లో కలియతిరుగుతూ సందడి చేసేందుకు ఈ సారి అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రజలు ఒక చోట చేసి సంబరాలు చేసుకోవటం..బహుమతులు పంచుకోవటం మానుకోవాలని తెలిపింది. వీలైనంత వరకు వర్చువల్ గానే శుభాకాంక్షలు తెలుపుకోవాలని సూచించింది. బహిరంగ ప్రాంతాలకు రావాల్సి వస్తే ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు రెండు మీటర్ల ఎడం పాటించాలని తెలిపింది. ఇక మూడు నాలుగు గంటలకు మించి జరిగే ఈవెంట్లకు ఖచ్చితంగా సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని, ఈవెంట్ల నిర్వహణలో కోవిడ్ నిబంధనలను అన్నింటిని ఖచ్చితంగా పాటించి తీరాలని ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA







