మొబైల్ యాప్ తో భారత్ నేరుగా మనీ ట్రాన్స్ ఫర్..సర్వీసులు ప్రారంభించిన ఖతార్ బ్యాంక్
- November 25, 2020
ఖతార్ లో ఉంటున్న భారతీయులు..ఇక నుంచి భారత్ లోని తమ బంధువులకు డబ్బులు పంపించటం మరింత సులభం కానుంది. క్షణాల్లో ఇండియాలోని బ్యాంకు ఖతాలకు నగదు బదిలీ చేసేలా ఖతార్ ఇస్లామిక్ బ్యాంక్ మొబైల్ సర్వీసులను ప్రారంభించింది. కేవలం 60 సెకండ్లలో మనీ ట్రాన్స్ ఫర్ చేయవచ్చని బ్యాంక్ ప్రతినిధులు వెల్లడించారు. వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని..మొబైల్ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. డెబిట్ కార్డు నెంబర్, పిన్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకొని ఇన్ స్టెంట్ సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు నగదు బదిలీలపై ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. నగదు బదిలీ కోసం ఖతార్ ఇస్లామిక్ బ్యాంక్...భారత్ లోని హెచ్.డీ.ఎఫ్.సీ. బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ఇండియాలోని బ్యాంకులకు మాత్రమే నగదు బదిలీ సేవలు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే ఇతర దేశాల్లోనూ మనీ ట్రాన్స్ ఫర్ స్కీంను అమలు చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









