కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా..విదేశీ ప్రయాణాల్లో పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి-యూఏఈ
- November 25, 2020
యూఏఈ నుంచి ఇతర దేశాలకు వెళ్లాలన్నా...ఇతర దేశాల నుంచి యూఏఈకి తిరిగి వచ్చే వారికైనా పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. ఈ మార్గదర్శకాలు గతంలోనే జారీ చేసినా...కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నేపథ్యంలో గత మార్గనిర్దేశకాల్లో సవరణలు చేసింది. కింగ్డమ్ పరిధిలో రెండు వర్గాలుగా వ్యాక్సినేషన్ జరిగిన విషయం తెలిసిందే. చైనా బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ సినోఫార్మ్ ను తమ దేశంలో క్లినికల్ ట్రయల్స్ కి అంగీకరించటంతో కొందరు వాలంటీర్లకు జులై నుంచే వ్యాక్సిన్ డోసులు వేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇది మొదటి వర్గం. ఇక నేషనల్ వ్యాక్సినేషన్ ప్రొగ్రామ్ కింద ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఇతర కీలక అధికారులకు కూడా వ్యాక్సిన్ డోసులు వేస్తున్నారు. ఇది రెండో వర్గం. సినోఫార్మ్ కు అత్యవసర అనుమతులు ఇచ్చిన తర్వాత రెండో వర్గంలోని వారికి వ్యాక్సిన్ డోసులు ఇస్తూ వస్తున్నారు. అయితే..వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రానా వారి విదేశీ ప్రయాణ నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని యూఏఈ స్పష్టం చేసింది. తొలి విడత డోసు తీసుకున్న వారు అబుదాబి వచ్చేందుకు ఎలాంటి రిపోర్ట్ లు అవసరం లేకున్నా...విదేశాలకు వెళ్లాలంటే మాత్రం పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. మరోవైపు విదేశాల నుంచి కింగ్డమ్ కు వచ్చే వారు...పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ వెంట తీసుకురావాలని, అలాగే యూఏఈలో అడుగు పెట్టిన నాటి నుంచి నాలుగో రోజున, ఎనిమిదో రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







