కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా..విదేశీ ప్రయాణాల్లో పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి-యూఏఈ
- November 25, 2020
యూఏఈ నుంచి ఇతర దేశాలకు వెళ్లాలన్నా...ఇతర దేశాల నుంచి యూఏఈకి తిరిగి వచ్చే వారికైనా పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. ఈ మార్గదర్శకాలు గతంలోనే జారీ చేసినా...కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నేపథ్యంలో గత మార్గనిర్దేశకాల్లో సవరణలు చేసింది. కింగ్డమ్ పరిధిలో రెండు వర్గాలుగా వ్యాక్సినేషన్ జరిగిన విషయం తెలిసిందే. చైనా బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ సినోఫార్మ్ ను తమ దేశంలో క్లినికల్ ట్రయల్స్ కి అంగీకరించటంతో కొందరు వాలంటీర్లకు జులై నుంచే వ్యాక్సిన్ డోసులు వేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇది మొదటి వర్గం. ఇక నేషనల్ వ్యాక్సినేషన్ ప్రొగ్రామ్ కింద ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఇతర కీలక అధికారులకు కూడా వ్యాక్సిన్ డోసులు వేస్తున్నారు. ఇది రెండో వర్గం. సినోఫార్మ్ కు అత్యవసర అనుమతులు ఇచ్చిన తర్వాత రెండో వర్గంలోని వారికి వ్యాక్సిన్ డోసులు ఇస్తూ వస్తున్నారు. అయితే..వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రానా వారి విదేశీ ప్రయాణ నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని యూఏఈ స్పష్టం చేసింది. తొలి విడత డోసు తీసుకున్న వారు అబుదాబి వచ్చేందుకు ఎలాంటి రిపోర్ట్ లు అవసరం లేకున్నా...విదేశాలకు వెళ్లాలంటే మాత్రం పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. మరోవైపు విదేశాల నుంచి కింగ్డమ్ కు వచ్చే వారు...పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ వెంట తీసుకురావాలని, అలాగే యూఏఈలో అడుగు పెట్టిన నాటి నుంచి నాలుగో రోజున, ఎనిమిదో రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







