కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా..విదేశీ ప్రయాణాల్లో పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి-యూఏఈ
- November 25, 2020
యూఏఈ నుంచి ఇతర దేశాలకు వెళ్లాలన్నా...ఇతర దేశాల నుంచి యూఏఈకి తిరిగి వచ్చే వారికైనా పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. ఈ మార్గదర్శకాలు గతంలోనే జారీ చేసినా...కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నేపథ్యంలో గత మార్గనిర్దేశకాల్లో సవరణలు చేసింది. కింగ్డమ్ పరిధిలో రెండు వర్గాలుగా వ్యాక్సినేషన్ జరిగిన విషయం తెలిసిందే. చైనా బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ సినోఫార్మ్ ను తమ దేశంలో క్లినికల్ ట్రయల్స్ కి అంగీకరించటంతో కొందరు వాలంటీర్లకు జులై నుంచే వ్యాక్సిన్ డోసులు వేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇది మొదటి వర్గం. ఇక నేషనల్ వ్యాక్సినేషన్ ప్రొగ్రామ్ కింద ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఇతర కీలక అధికారులకు కూడా వ్యాక్సిన్ డోసులు వేస్తున్నారు. ఇది రెండో వర్గం. సినోఫార్మ్ కు అత్యవసర అనుమతులు ఇచ్చిన తర్వాత రెండో వర్గంలోని వారికి వ్యాక్సిన్ డోసులు ఇస్తూ వస్తున్నారు. అయితే..వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రానా వారి విదేశీ ప్రయాణ నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని యూఏఈ స్పష్టం చేసింది. తొలి విడత డోసు తీసుకున్న వారు అబుదాబి వచ్చేందుకు ఎలాంటి రిపోర్ట్ లు అవసరం లేకున్నా...విదేశాలకు వెళ్లాలంటే మాత్రం పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. మరోవైపు విదేశాల నుంచి కింగ్డమ్ కు వచ్చే వారు...పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ వెంట తీసుకురావాలని, అలాగే యూఏఈలో అడుగు పెట్టిన నాటి నుంచి నాలుగో రోజున, ఎనిమిదో రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









