భారత విదేశాంగ మంత్రికి షేక్ మొహమ్మద్ ఘన స్వాగతం
- November 26, 2020
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జై శంకర్కి అబుదాబీలోని అల్ షాతి ప్యాలెస్లో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రితో షేక్ అహమ్మద్ పలు అంశాలపై చర్చించారు. రాజకీయ, ఆర్థిక అంశాలు వీరిద్దరి మధ్యా చర్చకు వచ్చాయి. అలాగే కరోనా వైరస్కి సంబంధించిన అంశాలు కూడా చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా ఇరువురూ చర్చించడం జరిగింది. భారత్ - యూఏఈ మధ్య మరింత మెరుగైన సంబంధాల కోసం ప్రధాని మోడీ కృషిని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ కొనియాడారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ డాక్టర్ అన్వర్ బిన్ మొహమ్మద్ గర్గాష్, అబుదాబీ ఎగ్జిక్యూటివ్ ఎఫైర్స్ అథారిటీ ఛైర్మన్ ఖల్దూన్ ఖలీఫా అల్ ముబారక్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









