భారత విదేశాంగ మంత్రికి షేక్ మొహమ్మద్ ఘన స్వాగతం
- November 26, 2020
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జై శంకర్కి అబుదాబీలోని అల్ షాతి ప్యాలెస్లో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రితో షేక్ అహమ్మద్ పలు అంశాలపై చర్చించారు. రాజకీయ, ఆర్థిక అంశాలు వీరిద్దరి మధ్యా చర్చకు వచ్చాయి. అలాగే కరోనా వైరస్కి సంబంధించిన అంశాలు కూడా చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా ఇరువురూ చర్చించడం జరిగింది. భారత్ - యూఏఈ మధ్య మరింత మెరుగైన సంబంధాల కోసం ప్రధాని మోడీ కృషిని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ కొనియాడారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ డాక్టర్ అన్వర్ బిన్ మొహమ్మద్ గర్గాష్, అబుదాబీ ఎగ్జిక్యూటివ్ ఎఫైర్స్ అథారిటీ ఛైర్మన్ ఖల్దూన్ ఖలీఫా అల్ ముబారక్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న







