ఒమన్ లో 8 నెలల తర్వాత జీరో డెత్...కొత్తగా 237 కేసులు

- December 02, 2020 , by Maagulf
ఒమన్ లో 8 నెలల తర్వాత జీరో డెత్...కొత్తగా 237 కేసులు

మస్కట్:ఒమన్ లో 24 గంటల వ్యవధిలో కొత్తగా 237 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు సుల్తానేట్ పరిధిలో మొత్తం 1,24,145 కేసులు నమోదయ్యాయి. అయితే..గడిచిన 24 గంటల్లో కోవిడ్ డెత్స్ నమోదు కాకపోవటం విశేషం. గత 8 నెలల్లో ఒక మరణం కూడా నమోదు కాకపోవటం ఇదే తొలిసారి. మరోవైపు కోవిడ్ రికవరి రేటు కూడా ఆశాజనకంగా వృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు 1,24,145 పాజిటివ్ కేసులలో...1,15,613 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రజల సహకారం, అప్రమత్తత వల్లే కోవిడ్ మరణాల రేటును తగ్గిస్తూ రాగలిగామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజల మద్దతును ప్రశంసించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com