విశాఖపట్నం లో ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం

- December 07, 2020 , by Maagulf
విశాఖపట్నం లో ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం
విశాఖపట్నం: భారత ఉప రాష్ట్రపతి  ఎం.వెంకయ్య నాయుడు సోమవారం ఉదయం  10.20 గంటలకు  విశాఖపట్నం విమానాశ్రయానికి  చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి  ముత్తం శెట్టి శ్రీనివాసరావు,  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, నగర పోలీస్ కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా, పార్లమెంట్ సభ్యులు  ఎం .వి.వి.సత్యనారాయణ, బి.వి.సత్యవతి, శాసన మండలి సభ్యులు  పి.వి.ఎన్ మాధవ్,  శాసన సభ్యులు  పి జి. వి ఆర్ నాయుడు, మాజీ శాసన సభ్యులు  పి.విష్ణుకుమార్ రాజు, జాయింట్  కలెక్టర్  గోవిందరావు, తదితరులు ఉన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com