అబుధాబిలో ట్రాఫిక్ రాడార్స్, రూల్స్ బ్రేక్ చేస్తే బుక్కైపోతారు!
- December 08, 2020
అబుధాబి:అబుధాబి రోడ్లపై సీట్ బెల్టు పెట్టుకోకుండా కారులో వెళ్తున్నారా? మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారా? అయితే..జనవరి 1 నుంచి జర భద్రం. సీటు బెల్టు పెట్టుకోకుండా...ఫోన్ మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించే వారిని పట్టుకునేందుకు ఆటోమెటిక్ సిస్టమ్ రాడార్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు అబుధాబి డిజిటల్ అథారిటీ ప్రకటించింది. వెహిక్యూలర్ అటెన్షన్ అండ్ సెఫ్టీ ట్రాకర్ అని పిలిచే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ట్రాకర్...రోడ్డుపై వెళ్లే వాహనం ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసిన మరుక్షణం కమాండ్ సెంటర్ కు మెసేజ్ పంపిస్తుంది. అలాగే కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సీటు బెల్టు పెట్టుకోకున్నా..ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నా..వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా పసిగట్టేస్తుంది. రాజధాని నగరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు అరికట్టడం, వాహనదారులకు భద్రతను పెంచే లక్ష్యంతో ట్రాకర్స్ ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









