ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!
- April 08, 2026
మస్కట్: అల్ బరకా ప్యాలెస్లో కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్ అహ్మద్ అల్ సబాను సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆహ్వానించారు. అనంతరం సమావేశమయ్యారు. కువైట్ ఎమిర్ షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా తరపున కువైట్ మంత్రి సుల్తాన్కు మరియు ఒమన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుల్తాన్ కూడా ఎమిర్కు మరియు కువైట్ ప్రజలకు తన శుభాకాంక్షలను తెలియజేశారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. యుద్ధం కారణంగా ప్రాంతీయ దేశాలపై మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై చూపుతున్న ప్రభావం గురించి కువైట్ దృక్పథాన్ని సుల్తాన్ కు వివరించారు. ఈ అంశాలపై ఒమన్ సుల్తానేట్ వైఖరిని మహోన్నత సుల్తాన్ పునరుద్ఘాటించారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి, రెచ్చగొట్టే చర్యలను నివారించడానికి మరియు సంక్షోభానికి మూలాల నుండే పరిష్కారాలను కనుగొనడానికి చేసే ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.ఇటువంటి చర్యలు ప్రాంతీయ భద్రత, స్థిరత్వం మరియు అక్కడి ప్రజల శ్రేయస్సును పరిరక్షించడంలో దోహదపడతాయని సుల్తాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







