ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!
- April 08, 2026
మస్కట్: అల్ బరకా ప్యాలెస్లో కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్ అహ్మద్ అల్ సబాను సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆహ్వానించారు. అనంతరం సమావేశమయ్యారు. కువైట్ ఎమిర్ షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా తరపున కువైట్ మంత్రి సుల్తాన్కు మరియు ఒమన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుల్తాన్ కూడా ఎమిర్కు మరియు కువైట్ ప్రజలకు తన శుభాకాంక్షలను తెలియజేశారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. యుద్ధం కారణంగా ప్రాంతీయ దేశాలపై మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై చూపుతున్న ప్రభావం గురించి కువైట్ దృక్పథాన్ని సుల్తాన్ కు వివరించారు. ఈ అంశాలపై ఒమన్ సుల్తానేట్ వైఖరిని మహోన్నత సుల్తాన్ పునరుద్ఘాటించారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి, రెచ్చగొట్టే చర్యలను నివారించడానికి మరియు సంక్షోభానికి మూలాల నుండే పరిష్కారాలను కనుగొనడానికి చేసే ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.ఇటువంటి చర్యలు ప్రాంతీయ భద్రత, స్థిరత్వం మరియు అక్కడి ప్రజల శ్రేయస్సును పరిరక్షించడంలో దోహదపడతాయని సుల్తాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









