ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!
- April 08, 2026
మస్కట్: అల్ బరకా ప్యాలెస్లో కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్ అహ్మద్ అల్ సబాను సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆహ్వానించారు. అనంతరం సమావేశమయ్యారు. కువైట్ ఎమిర్ షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా తరపున కువైట్ మంత్రి సుల్తాన్కు మరియు ఒమన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుల్తాన్ కూడా ఎమిర్కు మరియు కువైట్ ప్రజలకు తన శుభాకాంక్షలను తెలియజేశారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. యుద్ధం కారణంగా ప్రాంతీయ దేశాలపై మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై చూపుతున్న ప్రభావం గురించి కువైట్ దృక్పథాన్ని సుల్తాన్ కు వివరించారు. ఈ అంశాలపై ఒమన్ సుల్తానేట్ వైఖరిని మహోన్నత సుల్తాన్ పునరుద్ఘాటించారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి, రెచ్చగొట్టే చర్యలను నివారించడానికి మరియు సంక్షోభానికి మూలాల నుండే పరిష్కారాలను కనుగొనడానికి చేసే ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.ఇటువంటి చర్యలు ప్రాంతీయ భద్రత, స్థిరత్వం మరియు అక్కడి ప్రజల శ్రేయస్సును పరిరక్షించడంలో దోహదపడతాయని సుల్తాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









