ఫైన్ లేకుండా ఒమన్ వదిలివెళ్లనున్న 2000 మంది ఇండియన్స్
- December 08, 2020
వర్క్ పర్మిట్ గడువు ముగిసిన దాదాపు 2000 మంది భారతీయులు ఒమన్ విడిచి వెళ్లేందుకు రిజిస్టర్ చేసుకున్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
వారిలో సరైన పాస్ పోర్ట్ లేని 500 మందికి ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్లను కూడా జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. వర్క్ పర్మిట్ ముగిసిన వారు శాశ్వతంగా ఒమన్ విడిచి వెళ్లేందుకు వీలుగా..డిసెంబర్ 31 వరకు క్షమాభిక్ష గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31 లోగా దేశం విడిచి వెళ్తే..ఎలాంటి ఫైన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీంతో సరైన అనుమతులు లేని వారు క్షమాభిక్ష గడువును సద్వినియోగం చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం పిలుపునిచ్చింది. అటు భారత ప్రభుత్వం కూడా ఈసీ జారీ కోసం ఫీజు మినహాయింపులు ఇస్తోందని, రిజిస్టర్ చేసుకున్నవారికి కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రాగానే ఈసీ కోసం పాస్ పోర్టు/వీసా జారీ చేసే ఏదైనా బీఎల్ఎస్ సెంటర్ లో సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!









