చట్టపరమైన హక్కులపై వలసదారుల్లో అవగాహన
- February 19, 2016
మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరిటైజేషన్ సక్ర్ ఘోబాష్ 'నో యువర్ రైట్స్' (మీ హక్కులు తెలుసుకోండి) పేరుతో ఓ అవగాహనా క్యాంపెయిన్ని ప్రారంభించారు. కార్మికులు తమ హక్కులను తెలుసుకునేలా వారిలో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. దుబాయ్ ఎయిర్పోర్ట్స్లోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఘోబాష్ చెప్పారు. వర్క్ పర్మిట్లను పొందడం, అలాగే కాంట్రాక్టుల్ని రద్దు చేసుకోవడం, కొత్త కాంట్రాక్టుల్ని కుదుర్చుకోవడం వంటివాటికి సంబంధించి కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన డిక్రీల గురించి కార్మికుల్లో అవగాహన పెంచనున్నారు. కార్మికుల రక్షణ కోసం యూఏఈ కట్టుబడి ఉందని గోభాష్ చెప్పారు. అరబిక్, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ మరియు మలయాళ భాషల్లో రూపొందించిన బుక్లెట్స్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మినిస్ట్రీ ప్లాట్ఫామ్ ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ బుక్లెట్స్లో లీగల్ గైడ్లైన్స్, కార్మికుల్లో అవగాహన పెంచేలా పొందుపర్చబడ్డాయి. హక్కులు, ఆబ్లిగేషన్స్, అలాగే ల్యాబర్ డిస్ప్యూట్స్ వంటి గురించి వివరంగా పేర్కొన్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







