ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన...

- December 13, 2020 , by Maagulf
ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన...

న్యూ ఢిల్లీ:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల ఢిల్లీ టూర్ ముగిసింది.  రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ మొదటి రోజు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్ లను కలిశారు.  నిన్నటి రోజున పట్టణాభివృద్ధి శాఖ, పౌరవిమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరిని, ప్రధాని మోడీని కలిశారు.  ప్రధాని మోడీతో కీలక విషయాలపై చర్చించారు.  విభజన చట్టంలోని వివిధ అంశాలపైనా, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, వరదల సాయంతో పాటుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కూడా సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.  రెండు రోజుల టూర్ ముగించుకొని ఈరోజు కేసీఆర్ తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు.  ఈరోజు మధ్యాహ్నం వరకు కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకుంటారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com