ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన...
- December 13, 2020న్యూ ఢిల్లీ:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల ఢిల్లీ టూర్ ముగిసింది. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ మొదటి రోజు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్ లను కలిశారు. నిన్నటి రోజున పట్టణాభివృద్ధి శాఖ, పౌరవిమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరిని, ప్రధాని మోడీని కలిశారు. ప్రధాని మోడీతో కీలక విషయాలపై చర్చించారు. విభజన చట్టంలోని వివిధ అంశాలపైనా, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, వరదల సాయంతో పాటుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కూడా సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. రెండు రోజుల టూర్ ముగించుకొని ఈరోజు కేసీఆర్ తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకుంటారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు