అమిత్‌ షాతో ముగిసిన సీఎం జగన్‌‌ భేటీ

- December 15, 2020 , by Maagulf
అమిత్‌ షాతో ముగిసిన సీఎం జగన్‌‌ భేటీ

న్యూ ఢిల్లీ:ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నివర్‌ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలు, ధ్వంసమైన రహదారులు, ఆస్తి నష్టం గురించి వివరించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు సహా నిధుల విషయంలో కాస్త జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను అమిత్‌ షా దృష్టికి సీఎం తీసుకువెళ్లారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

పోలవరం ఆయకట్టు కింద పంటలకు 2022 ఖరీఫ్‌ సీజన్‌లో నీళ్లు అందించాల్సి ఉన్నందున వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికే ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా ప్రణాళికను అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలవరానికి సంబంధించి నిధులు విషయంలో జోక్యం చేసుకుని..ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం జగన్ అమిత్ షాను కోరారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com