యూకేలో మళ్లీ లాక్డౌన్..
- December 20, 2020లండన్: యూకేలో క్రిస్మస్ వేడుకలకు బ్రేక్ పడింది. కొత్తరకం కరోనా వైరస్ పంజా విసురుతుండటంతో దేశం మళ్లీ లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. మూడు రోజులుగా బ్రిటన్ లో నమోదవుతున్న కరోనా కేసుల్లో 60 శాతానికి పైగా కొత్త రకం వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వైరస్ 70 శాతం వేగంగా వ్యాపిస్తుందని అధికారులు వెల్లడించారు. దీంతో వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు లండన్ తో పాటు దక్షిణ ఇంగ్లాండ్లో లాక్డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం.
నిన్నటి నుంచి లాక్డౌన్ అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో క్రిస్మస్ ఫెస్టివల్ నిర్వహించుకోలేకపోతున్నామని ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే ఎట్టిపరిస్థితుల్లో ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దని యూకే వైద్యాధికారులు చెబుతున్నారు. ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండాలని సూచించారు. అప్రమత్తంగా లేకపోతే కొత్త వైరస్కు గురికావల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?