ఖర్జూరం తో .. పలు ఉపయోగాలు..

- December 21, 2020 , by Maagulf
ఖర్జూరం తో .. పలు ఉపయోగాలు..

ఖర్జూర పండ్లు విటమిన్ ఎ, బిలను కలిగి ఉంటాయి. ఈ రెండూ ఇందులో ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచుటలో ఎంతగానో ఉపయోగపడతాయి.

ఏపండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. ఈ పండులో ఔషధ గుణాలు కూడా ఎక్కువ. ఖర్జూరలో రోగ నిరోధకశక్తి ని పెంచే గుణం మెండుగా ఉంటుంది. రకహీనతతో బాధపడుతున్నవారు, నీరసముగా ఉండేవారు, ఖర్జూర పండ్లు, పాలు, మీగడ లేదా కొద్దిగా నెయ్యి కలిపి ఉదయాన్నే అల్పాహారం గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఖర్జూర పండ్లు విటమిన్ ఎ, బిలను కలిగి ఉంటాయి. ఈ రెండూ ఇందులో ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచుటలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి. ఖర్జూరపండు శరీరంలో అధికంగా గల వాతమున్ని పోగొడుతుంది.

మలబద్దకముతో బాధపడే వారు పాలల్లో 4నుంచి 5ఎండు ఖర్జూర పండ్లు వేసి మరగబెట్టి రాత్రి నిద్రపోయే ముందు తాగాలి. నీరసము, నిస్సత్తువతో బాధపడుతున్నవారు కొన్ని నెలల పాటూ రోజుకు15నుంచి 20 ఖర్జూర పండ్లు భోజనము తర్వాత తీసుకోవాలి. ఎండా కాలం వడదెబ్బ తగులకుండా ఉండాలంటే, ఖర్జూరపండును రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి.

మూత్రం సాఫీగా కానివారు ఖర్జూరపండు తింటే వారికి సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.
గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు మంచి మందు. అలాగే ఖర్జూర చెట్టు కూడా కొన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.


డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు.చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పి తగ్గుతుంది. మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే ఖర్జూరపండు తరచుగా తినాలి.

రోజూ నానబెట్టిని డేట్స్ ను ఒకటి రెండు తినడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీ వస్తుంది. విటమిన్ సప్లిమెంట్ తీసుకునే అవకాశం ఉండదు. గ్లోకోజ్, ఫ్రక్టోజ్ వంటి నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల ఇవి ఎనర్జీ లెవల్స్ ను మార్చుతుంది. త్వరగా మార్పు వస్తుంది.

డేట్స్ లో సెలీనియం, మెగ్నీషియం, కాపర్, మరియు మెగ్నీషియంలు అధికంగా ఉన్నాయి. ఇవన్నీ బోన్స్ హెల్తీగా ఉండటానికి , ఓస్టిరియో ఫోసిస్ కండీషన్ ను నివారించడానికి ఇవి సహాయపడుతాయి.

దంతాలను ఆరోగ్యంగా ఉంచే ఫోరిన్ మాత్రమే కాకుండా, ఐరన్ కూడా వీటిలో పుష్కలంగా ఉంటుంది..ఐరన్ లోపంతో బాధపడే వారు వీటిని ఎక్కువగా తీసుకోవాలి.
డేట్స్ లో ఉండే విటమిన్ సి, డిలు స్కిన్ ఎలాసిటిని పెంచుతాయి. దాంతో చర్మం స్మూత్ గా మారుతుంది. చర్మ సమస్యలను నివారిస్తుంది.

హ్యాంగోవర్ సమస్యను తగ్గిస్తుంది:
చాలా మందికి ఈ విషయం తెలిసుండకపోవచ్చు. హ్యాంగోవర్ ను తగ్గించడంతో ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి. తాగింది దిగాలంటే వీటిని తింటే మంచి ఫలితం ఉంటుందంట.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com