కోవిడ్‌ 19 వల్ల జాబ్‌ కోల్పోయి.. 1 మిలియన్‌ గెల్చుకుని..

- December 21, 2020 , by Maagulf
కోవిడ్‌ 19 వల్ల జాబ్‌ కోల్పోయి.. 1 మిలియన్‌ గెల్చుకుని..

అబుధాబి: భారత వలసదారుడొకరు, కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయినా, మిలియనీర్‌గా మారారు. 30 ఏళ్ళ నవనీత్‌ సజీవన్‌, అబుదాబీలో నివసిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆయన ఉద్యోగం కోల్పోయారు. అయితే, దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్‌ మరియు ఫైనెస్ట్‌ ప్రమోషన్‌లో నవనీత్‌ సజీవన్‌ విజేతగా నిలిచి 1 మిలియన్‌ డాలర్స్‌గ ఎలుచుకున్నారు. డిసెంబర్‌ 28 ఆయనకు చివరి వర్కింగ్‌ డే. ఆ తర్వాత ఏం చేయాలన్నదానిపై ఆయనకు ఏమీ పాలుపోని పరిస్థితి. సరిగ్గా ఈ టైమ్‌లో ఆయనకు అద్భుతమైన అవకాశం దక్కింది మిలీనియం బంపర్‌ ఆఫర్‌ ద్వారా. మూడేల్ళుగా అబుదాబీ బిగ్‌ టికెట్‌ కొంటున్నాననీ, ఈసారి తనను అదృష్టం వరించిందనీ ఆయన చెప్పారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com