కొత్త కరోనా వైరస్:బోర్డర్స్ని మూసేసిన కువైట్
- December 21, 2020
కువైట్ సిటీ:నేటి నుండి జనవరి 1వ తేదీ వరకు అంతర్జాతీయ వాణిజ్య విమానాల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ కనుగొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.రోడ్డు అలాగే సముద్రపు బోర్డర్స్ని కూడా మూసివేసినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తారిఖ్ అల్ ముజ్రిమ్ తెలిపారు. అత్యవసర విభాగాలకు సంబంధించి అంతర్జాతీయ ప్రయాణాలకు మాత్రం కాస్త వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ నిషేధం ఇంకో వారం పొడిగించే అవకాశాలు కూడా వున్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ దేశాల నుంచీ అలాగే కొత్త స్ట్రెయిన్ వెలుగు చూసిన దేశాల నుంచి వచ్చినవారి కోసం ప్రత్యేకంగా కొన్ని నిబంధనల్ని జారీ చేశారు.డిసెంబర్ 8 తర్వాత వచ్చినవారు రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలో వుండాల్సి వుంటుంది. ప్రతి ఐదు రోజుల తర్వాత వారు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష