శుక్రవారం నుంచి అన్ని హెల్త్ సెంటర్స్లో కోవిడ్ 19 వ్యాక్సిన్
- December 23, 2020
మనామా:ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకునే అవకావం లేకుండానే ఎంపిక చేయబడిన రెసిడెన్షియల్ హెల్త్ సెంటర్స్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వుంటుందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. శుక్రవారం, 25 డిసెంబర్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఆన్లైన్లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నవారిని సంబంధిత అధికారులు కాంటాక్ట్ చేస్తారనీ, వారికి డిసెంబర్ 24న అపాయింట్మెంట్ వివరాలు వెల్లడిస్తారనీ మినిస్ట్రీ పేర్కొంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాక్సిన్ అందుబాటులో వుంటుంది. శుక్ర, శనివారాల్లోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుఉంది. ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేకుండానే వ్యాక్సిన్ని పొందవచ్చు. 18 ఏళ్ళు దాటిన పౌరులు, నివాసితులకు వ్యాక్సిన్ని ఉచితంగా అందించనున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







