ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త

- December 23, 2020 , by Maagulf
ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త

అమరావతి:ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది.  రైతులకు ఈనెల 29 వ తేదీన రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అందించే రూ.2వేల రూపాయల సహాయంతో పాటుగా ఇన్ ఫుట్ సబ్సిడీ మొత్తం కూడా రైతుల ఖాతాల్లో వేయబోతున్నారు.ఏపీ వ్యవసాయశాఖ ద్వారా రాష్ట్రంలోని 50.47 లక్షల మంది రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ కాబోతున్నాయి.  మొదట ఇన్ ఫుట్ సబ్సిడీ అమౌంట్ ఈనెల 27 వ తేదీన జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించారు.  అయితే, రెండు రోజుల వ్యవధిలో రైతు భరోసా పథకం కింద డబ్బులు అందజేయాలి కాబట్టి రెండు విడివిడిగా కాకుండా ఒకేరోజున రైతుల అకౌంట్ లో జమ కాబోతున్నాయి.  న్యూ ఇయర్ కు రెండు రోజుల ముందుగానే రైతుల అకౌంట్ లోకి డబ్బులు జమ కాబోతుండటం మంచి విషయంగా చెప్పుకోవాలి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com