తెలంగాణ:యూకే నుంచి రాష్ట్రానికి 1200 మంది
- December 24, 2020
హైదరాబాద్:కొత్త రకం కరోనా వైరస్ ఇప్పుడు అన్ని దేశాలను, రాష్ట్రాలను కలవరపెడుతోంది... ఆదిలోనే చెక్ పెట్టే విధంగా అప్రమత్తమైన రాష్ట్రాలు విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి... ఇక, కొత్త రకం కరోనా వైరస్తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటున్నచర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు యూకే నుండి, యూకే మీదుగా తెలంగాణకు 1200 మంది వచ్చారని తెలిపారు.. అయితే, వీరిలో ఇప్పటికే 846 మందిని గుర్తించినట్టు వెల్లడించారు.. అందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురికి పాజిటివ్గా తేలిందన్న మంత్రి.. కానీ, అది కోవిడా? లేక కొత్త రకం వైరసా? అని నిర్ధారించుకోవడానికి వారికి శాంపిల్స్ హైదరాబాద్లోని సీసీఎంబీ ల్యాక్కు వైద్యశాఖ అధికారులు పంపించారని తెలిపారు. మరోవైపు.. పాజిటివ్ వచ్చిన వారు.. కలిసిన వారందరినీ కూడా ట్రేసింగ్ చేస్తున్నామని.. నెగెటివ్ వచ్చిన వారిని సైతం మానిటరింగ్ చేస్తున్నామని వెల్లడించారు. యూకే నుంచి వచ్చిన వాళ్లలో హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, మేడ్చల్, జగిత్యాలలలో పాజిటివ్ కేసులు నమొదు అయ్యాయి.. ఇప్పటి వరకు ఏడుగురికి పాజిటివ్గా తేలగా.. జిన్ మ్యాపింగ్ రిపోర్ట్ రావటానికి మూడు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







