జనవరి 31, 2021 వరకూ లాక్డౌన్ మార్గదర్శకాల పొడిగింపు
- December 29, 2020
న్యూఢిల్లీ: కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా సూచించిన మార్గదర్శకాలను జనవరి 31, 2021 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లపై ఎప్పటిలాగే నిఘా కొనసాగుతుందని తెలిపింది. నిబంధనలను కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా అమలు చేయనున్నట్లు పేర్కొంది. యూకేలో కొత్త స్ట్రెయిన్ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు హోం శాఖ సూచించింది. నవంబర్ 25న కేంద్ర హోం శాఖ, వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలనే జనవరి 31, 2021 వరకూ పాటించాలని కేంద్రం సూచించింది. ఆరోగ్య సేతు యాప్ను విధిగా అందరూ వినియోగించాలని కోరింది. కంటైన్మెంట్ జోన్ల బయట 50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లకు కేంద్రం అనుమతినిచ్చింది.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









