కువైట్:రెసిడెన్సీ వయోలేటర్స్ కు క్షమాభిక్ష గడువు జనవరి 31వరకు పెంపు
- December 31, 2020కువైట్ సిటీ:నివాస అనుమతుల గడువు ముగిసిన ప్రవాసీయులకు క్షమాభిక్ష గడువును పెంచింది కువైట్ ప్రభుత్వం. జనవరి 31 వరకల్లా దేశం విడిచి వెళ్లే వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని వెల్లడించింది. కువైట్లోని ప్రవాసీయుల రెసిడెన్సీ గడువుకు సంబంధించి కువైట్ ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గడువు ముగిసిన వాళ్లందరూ రెసిడెన్సీ స్టేటస్ మార్చుకోవాలనుకున్నా...దేశం విడిచి వెళ్లాలనుకున్నా ఫైన్ చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. క్షమాభిక్ష గడువు డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమలులో ఉంటుందని ఆలోగా దేశం విడిచి వెళ్లినా..స్టేటస్ మార్చుకున్నా లీగల్ యాక్షన్ ఉండదని వివరించింది. అయితే.ఇప్పుడు మరోసారి క్షమాభిక్ష గడువును జనవరి 31 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణీత గడువు లోగా ఫైన్ చెల్లించి రెసిడెన్సీ స్టేటస్ మార్చుకోకపోయినా...దేశం వదిలి వెళ్లకపోయినా లీగల్ యాక్షన్ ఎదుర్కొవాల్సి వస్తుందని కువైట్ హెచ్చరించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు