కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 16 మంది విదేశీయులకు జైలు శిక్ష
- December 31, 2020
మస్కట్: సుప్రీం కమిటీ సూచించిన కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పదహారు మందికి జైలు శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. శిక్ష పడిన వాళ్లంతా విదేశీయులే. దోషులు అందరూ గ్యాంబ్లింగ్ ఆడేందుకు ఒకే చోట గుమి కూడటంతో పాటు కోవిడ్ నిబంధనలను పాటించకపోవటం, దోషుల్లో ఇద్దరు ఒమన్ చట్టాలను అధిగమించినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. దోషుల్లో ప్రధాన నిందితుడు తన నివాసాన్ని గ్యాంబ్లింగ్ అడ్డాగా మార్చి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో ప్రధాన నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అల్ షర్కియా గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక మరో ఇద్దరిలో ఒకరు నివాస అనుమతి గడువు ముగిసినా రెన్యూవల్ చేసుకోలేదని, మరొకరు స్పాన్సర్ దగ్గర కాకుండా మరో చోట పని చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష పడగా..మిగిలిన 15 మందికి మూడు నెలల జైలు శిక్ష OMR500 ఫైన్ విధించింది కోర్టు. అలాగే శిక్షా కాలం పూర్తి కాగానే దోషులు అందర్ని దేశం నుంచి బహిష్కరించటంతో పాటు మళ్లీ వాళ్లు తిరిగి రాకుండా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!