కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 16 మంది విదేశీయులకు జైలు శిక్ష
- December 31, 2020
మస్కట్: సుప్రీం కమిటీ సూచించిన కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పదహారు మందికి జైలు శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. శిక్ష పడిన వాళ్లంతా విదేశీయులే. దోషులు అందరూ గ్యాంబ్లింగ్ ఆడేందుకు ఒకే చోట గుమి కూడటంతో పాటు కోవిడ్ నిబంధనలను పాటించకపోవటం, దోషుల్లో ఇద్దరు ఒమన్ చట్టాలను అధిగమించినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. దోషుల్లో ప్రధాన నిందితుడు తన నివాసాన్ని గ్యాంబ్లింగ్ అడ్డాగా మార్చి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో ప్రధాన నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అల్ షర్కియా గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక మరో ఇద్దరిలో ఒకరు నివాస అనుమతి గడువు ముగిసినా రెన్యూవల్ చేసుకోలేదని, మరొకరు స్పాన్సర్ దగ్గర కాకుండా మరో చోట పని చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష పడగా..మిగిలిన 15 మందికి మూడు నెలల జైలు శిక్ష OMR500 ఫైన్ విధించింది కోర్టు. అలాగే శిక్షా కాలం పూర్తి కాగానే దోషులు అందర్ని దేశం నుంచి బహిష్కరించటంతో పాటు మళ్లీ వాళ్లు తిరిగి రాకుండా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









