ఆరోగ్య ప్రమాణాలు పాటించని రెస్టారెంట్ సీజ్

- December 31, 2020 , by Maagulf
ఆరోగ్య ప్రమాణాలు పాటించని రెస్టారెంట్ సీజ్

అబుధాబి: ఆహార భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వినియోగదారుల ఆరోగ్యానికి హని కలిగిస్తున్నారనే ఆరోపణలతో ఓ రెస్టారెంట్ ను వ్యవసాయ, అహార భద్రత అధికారులు సీజ్ చేశారు. ముసఫ్ఫా ప్రాంతంలోని స్పెషల్ డిన్నర్ రెస్టారెంట్ కొన్నాళ్లుగా అహార భద్రత ప్రమాణాలను పాటించటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ, అహార భద్రత అధికారులు పలు మార్లు తనిఖీలు నిర్వహించి ఇప్పటికే మూడు సార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు. వంట గది మొత్తం అపరిశుభ్రంగా ఉందని, వంట విషయంలోనూ నాణ్యత లేదని ఆరోపించింది. హెచ్చరికలు చేస్తున్నప్పటికీ రెస్టారెంట్ నిర్వాహకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో రెస్టారెంట్ ను సీజ్ చేసినట్లు అధికారులు వివరించారు. వినియోగదారుల ఆరోగ్య భద్రత తమకు ముఖ్యమని, రెస్టారెంట్ నిర్వాహకులు తమ తప్పులను దిద్దుకున్న తర్వాతే మళ్లీ ప్రారంభించేందుకు అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రమాణాలు పాటించకుండా నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ప్రజలు గుర్తిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 800555కి ఫోన్ చేసి తమకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com