దేవాలయాలపై నిరంతర నిఘా-ఏపీ డీజీపీ
- January 03, 2021
అమరావతి:ఏ.పీలో ఇటీవల కాలంలో దేవాలయాలపై వరసగా దాడులు జరుగుతున్నాయి. ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. రామతీర్ధం ఘటనతో ఒక్కసారిగా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలు సీరియస్ అయ్యాయి. ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. ఏపీలోని అన్ని దేవాలయాలు, ప్రార్ధనా మందిరాల వద్ద నిరంతరం నిఘా పెట్టాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఏపీ పోలీసులతో పాటుగా, అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై 100కి సమాచారం ఇవ్వాలని అన్నారు. భద్రతా పరమైన చర్యలను పర్యవేక్షించాలని జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు డీజీపీ.ప్రతి ఒక్క దేవాలయానికి జియో ట్యాగింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.
తాజా వార్తలు
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ









