దేవాలయాలపై నిరంతర నిఘా-ఏపీ డీజీపీ
- January 03, 2021
అమరావతి:ఏ.పీలో ఇటీవల కాలంలో దేవాలయాలపై వరసగా దాడులు జరుగుతున్నాయి. ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. రామతీర్ధం ఘటనతో ఒక్కసారిగా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలు సీరియస్ అయ్యాయి. ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. ఏపీలోని అన్ని దేవాలయాలు, ప్రార్ధనా మందిరాల వద్ద నిరంతరం నిఘా పెట్టాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఏపీ పోలీసులతో పాటుగా, అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై 100కి సమాచారం ఇవ్వాలని అన్నారు. భద్రతా పరమైన చర్యలను పర్యవేక్షించాలని జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు డీజీపీ.ప్రతి ఒక్క దేవాలయానికి జియో ట్యాగింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







