మొబైల్ ఫోన్ పోతే HawkEye appలో ఫిర్యాదు చేయండి-సీపీ అంజనీకుమార్
- January 03, 2021హైదరాబాద్:మొబైల్ ఇప్పుడు మనిషికి నిత్యావసరంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే దాని ప్రాముఖ్యత అంతకంటే ఎక్కువే. చేతిలో మొబైల్ ఉంటే..ప్రపంచంలోని ఏం జరుగుతున్నా తెలిసిపోతుంది. ఇక మన వ్యక్తిగత ఫోటోలు, డేటా తదితరాలు అన్నీ ఫోన్లో నిక్షిప్తం చేస్తున్నాం. ఈ క్రమంలో పోయిన మొబైల్ ఫోన్లను..తిరిగి యజమానులకు అప్పగించడం చాలా అవసరమని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. అందుకే HawkEye లాస్ట్ మొబైల్ ఫోన్లో కంప్లైంట్ చేసిన వాటిని ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఐడెంటిఫై చేసి.. వాటిని రికవరీ చేస్తున్నారు.
తాజాగా 35 కంప్లైంటులకు సంబంధించి రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను సీపీ అంజనీకుమార్ యజమానులకు అందించారు. 2015లో ప్రారంభమైన HawkEye యాప్ అప్లికేషన్ ప్రారంభమైంది. అప్పట్నుంచి దాదాపు 500 మొబైల్ ఫోన్లను గుర్తించి వాటిని తిరిగి యజమానులకు అందించినట్లు పోలీసులు తెలిపారు.మొబైల్ ఫోన్ పోతే.. వెంటనే HawkEyeలో కంప్లైంట్ చేయాలని సీపీ అంజనీకుమార్ సూచించారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం