మొబైల్ ఫోన్ పోతే HawkEye appలో ఫిర్యాదు చేయండి-సీపీ అంజనీకుమార్
- January 03, 2021
హైదరాబాద్:మొబైల్ ఇప్పుడు మనిషికి నిత్యావసరంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే దాని ప్రాముఖ్యత అంతకంటే ఎక్కువే. చేతిలో మొబైల్ ఉంటే..ప్రపంచంలోని ఏం జరుగుతున్నా తెలిసిపోతుంది. ఇక మన వ్యక్తిగత ఫోటోలు, డేటా తదితరాలు అన్నీ ఫోన్లో నిక్షిప్తం చేస్తున్నాం. ఈ క్రమంలో పోయిన మొబైల్ ఫోన్లను..తిరిగి యజమానులకు అప్పగించడం చాలా అవసరమని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. అందుకే HawkEye లాస్ట్ మొబైల్ ఫోన్లో కంప్లైంట్ చేసిన వాటిని ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఐడెంటిఫై చేసి.. వాటిని రికవరీ చేస్తున్నారు.
తాజాగా 35 కంప్లైంటులకు సంబంధించి రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను సీపీ అంజనీకుమార్ యజమానులకు అందించారు. 2015లో ప్రారంభమైన HawkEye యాప్ అప్లికేషన్ ప్రారంభమైంది. అప్పట్నుంచి దాదాపు 500 మొబైల్ ఫోన్లను గుర్తించి వాటిని తిరిగి యజమానులకు అందించినట్లు పోలీసులు తెలిపారు.మొబైల్ ఫోన్ పోతే.. వెంటనే HawkEyeలో కంప్లైంట్ చేయాలని సీపీ అంజనీకుమార్ సూచించారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









