తెలంగాణాలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- January 04, 2021హైదరాబాద్:తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి... రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 238 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 518 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.. ఇక, మరో ఇద్దరు కరోనాతో మృతిచెందారు.. దీంతో.. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,87,740కు చేరుకోగా.. ఇప్పటి వరకు 2,81,083 మంది రికవరీ అయ్యారు.. మృతుల సంఖ్య 1551కి పెరిగింది... మరోవైపు.. దేశంలో కరోనా మరణాలశాతం 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి పరిమితం అయ్యింది.. రికవరీ రేటు దేశ్యాప్తంగా 96.2 శాతం ఉంటే.. రాష్ట్రంలో 97.68 శాతానికి పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,106 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 2,942 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్టు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది. అయితే, ఆదివారం కావడంతో నిన్న కరోనా టెస్ట్ల సంఖ్య కూడా తగ్గిపోయింది.. కోవిడ్ బులెటిన్ ప్రకారం 27,077 శాంపిల్స్ పరీక్షించారు.. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ టెస్ట్ల సంఖ్య 70,18,564కు చేరింది. తాజా కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 60 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 26, వరంగల్ అర్బన్లో 20, మల్కాజ్గిరిలో 15 కొత్త కేసులు వెలుగు చూశాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం