ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత: పోటెత్తిన ప్రయాణీకులు
- January 04, 2021
రియాద్:విదేశాల్లో నిలిచిపోయిన వేలాది మంది సౌదీలు, వలసదారులు, కింగ్డమ్కి తిరిగి వెళ్ళేందుకు పోటీ పడుతున్నారు. విమానాలపై నిషేధాన్ని సౌదీ అరేబియా ఎత్తివేయడంతో పెద్దయెత్తున ప్రయాణీకులు టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. విమానం ద్వారా, సముద్ర మార్గంలో, రోడ్డు మార్గాన వచ్చేందుకు ప్రయాణీకులు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యూకేలో కరోనా కొత్త స్ట్రెయిన్ వెలుగు చూసిన దరిమిలా, రెండు వారాలుగా సౌదీ అరేబియా, ట్రావెల్ బ్యాన్ విధించిన సంగతి తెల్సిందే. ఆదివారం ఉదయం 11 గంటలకు ట్రావెల్ బ్యాన్ ఎత్తివేశారు. కరోనా నిబంధనల కారణంగా, చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామని ప్రయాణీకులు చెబుతున్నారు. సౌదీ నుంచి వేరే పనుల నిమిత్తం విదేశాలకు వచ్చి ఇరుక్కుపోయామనీ, ఆయా దేశాల నిబంధనలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు ప్రయాణీకులు వాపోయారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









