ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత: పోటెత్తిన ప్రయాణీకులు
- January 04, 2021
రియాద్:విదేశాల్లో నిలిచిపోయిన వేలాది మంది సౌదీలు, వలసదారులు, కింగ్డమ్కి తిరిగి వెళ్ళేందుకు పోటీ పడుతున్నారు. విమానాలపై నిషేధాన్ని సౌదీ అరేబియా ఎత్తివేయడంతో పెద్దయెత్తున ప్రయాణీకులు టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. విమానం ద్వారా, సముద్ర మార్గంలో, రోడ్డు మార్గాన వచ్చేందుకు ప్రయాణీకులు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యూకేలో కరోనా కొత్త స్ట్రెయిన్ వెలుగు చూసిన దరిమిలా, రెండు వారాలుగా సౌదీ అరేబియా, ట్రావెల్ బ్యాన్ విధించిన సంగతి తెల్సిందే. ఆదివారం ఉదయం 11 గంటలకు ట్రావెల్ బ్యాన్ ఎత్తివేశారు. కరోనా నిబంధనల కారణంగా, చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామని ప్రయాణీకులు చెబుతున్నారు. సౌదీ నుంచి వేరే పనుల నిమిత్తం విదేశాలకు వచ్చి ఇరుక్కుపోయామనీ, ఆయా దేశాల నిబంధనలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు ప్రయాణీకులు వాపోయారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు