ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత: పోటెత్తిన ప్రయాణీకులు
- January 04, 2021
రియాద్:విదేశాల్లో నిలిచిపోయిన వేలాది మంది సౌదీలు, వలసదారులు, కింగ్డమ్కి తిరిగి వెళ్ళేందుకు పోటీ పడుతున్నారు. విమానాలపై నిషేధాన్ని సౌదీ అరేబియా ఎత్తివేయడంతో పెద్దయెత్తున ప్రయాణీకులు టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. విమానం ద్వారా, సముద్ర మార్గంలో, రోడ్డు మార్గాన వచ్చేందుకు ప్రయాణీకులు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యూకేలో కరోనా కొత్త స్ట్రెయిన్ వెలుగు చూసిన దరిమిలా, రెండు వారాలుగా సౌదీ అరేబియా, ట్రావెల్ బ్యాన్ విధించిన సంగతి తెల్సిందే. ఆదివారం ఉదయం 11 గంటలకు ట్రావెల్ బ్యాన్ ఎత్తివేశారు. కరోనా నిబంధనల కారణంగా, చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామని ప్రయాణీకులు చెబుతున్నారు. సౌదీ నుంచి వేరే పనుల నిమిత్తం విదేశాలకు వచ్చి ఇరుక్కుపోయామనీ, ఆయా దేశాల నిబంధనలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు ప్రయాణీకులు వాపోయారు.
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







