ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత: పోటెత్తిన ప్రయాణీకులు
- January 04, 2021
రియాద్:విదేశాల్లో నిలిచిపోయిన వేలాది మంది సౌదీలు, వలసదారులు, కింగ్డమ్కి తిరిగి వెళ్ళేందుకు పోటీ పడుతున్నారు. విమానాలపై నిషేధాన్ని సౌదీ అరేబియా ఎత్తివేయడంతో పెద్దయెత్తున ప్రయాణీకులు టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. విమానం ద్వారా, సముద్ర మార్గంలో, రోడ్డు మార్గాన వచ్చేందుకు ప్రయాణీకులు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యూకేలో కరోనా కొత్త స్ట్రెయిన్ వెలుగు చూసిన దరిమిలా, రెండు వారాలుగా సౌదీ అరేబియా, ట్రావెల్ బ్యాన్ విధించిన సంగతి తెల్సిందే. ఆదివారం ఉదయం 11 గంటలకు ట్రావెల్ బ్యాన్ ఎత్తివేశారు. కరోనా నిబంధనల కారణంగా, చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామని ప్రయాణీకులు చెబుతున్నారు. సౌదీ నుంచి వేరే పనుల నిమిత్తం విదేశాలకు వచ్చి ఇరుక్కుపోయామనీ, ఆయా దేశాల నిబంధనలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు ప్రయాణీకులు వాపోయారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







