ఫ్యూయల్ ట్యాంక్ పేలి ఇద్దరు మృతి
- January 08, 2021
కువైట్: కువైట్ లోని పారిశ్రామిక ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఇంధనం ట్యాంక్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. షువైఖ్ ప్రాంతంలోని పారిశ్రామిక వాడలో ట్యాంక్ కు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ట్యాంకర్ 30 మీటర్ల దూరంలోని వంతెన దగ్గర పడింది. దీన్ని బట్టి పేలుడు తీవ్రతను అంచనా వేయవచ్చు. ప్రమాదం గురించి సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. అయితే..ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు, గాయపడిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







