ఫ్యూయల్ ట్యాంక్ పేలి ఇద్దరు మృతి
- January 08, 2021
కువైట్: కువైట్ లోని పారిశ్రామిక ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఇంధనం ట్యాంక్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. షువైఖ్ ప్రాంతంలోని పారిశ్రామిక వాడలో ట్యాంక్ కు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ట్యాంకర్ 30 మీటర్ల దూరంలోని వంతెన దగ్గర పడింది. దీన్ని బట్టి పేలుడు తీవ్రతను అంచనా వేయవచ్చు. ప్రమాదం గురించి సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. అయితే..ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు, గాయపడిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష