ఫ్యూయల్ ట్యాంక్ పేలి ఇద్దరు మృతి

- January 08, 2021 , by Maagulf
ఫ్యూయల్ ట్యాంక్ పేలి ఇద్దరు మృతి

కువైట్: కువైట్ లోని పారిశ్రామిక ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఇంధనం ట్యాంక్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. షువైఖ్ ప్రాంతంలోని పారిశ్రామిక వాడలో ట్యాంక్ కు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ట్యాంకర్ 30 మీటర్ల దూరంలోని వంతెన దగ్గర పడింది. దీన్ని బట్టి పేలుడు తీవ్రతను అంచనా వేయవచ్చు. ప్రమాదం  గురించి సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. అయితే..ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు, గాయపడిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com