తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 09, 2021హైదరాబాద్:తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోయింది... రోజువారి కేసుల సంఖ్య 300 దిగువకు పడిపోయింది.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో 298 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతిచెందారు. ఇదే సమయంలో 474 మంది కోలుకున్నారు. దీంతో...కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,433కు చేరుకోగా... 2,83,048 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,563 మంది కరోనాతో మృతిచెందారు. ఇక, తెలంగాణలో కరోనా మృతుల శాతం 0.54 శాతంగా ఉంటే.. దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉందని.. రాష్ట్రంలో రికవరీ రేటు 97.79 శాతంగా ఉంటే.. భారత్లో 96.4 శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రంలో 4,822 యాక్టివ్ కేసులు ఉండగా... వీరిలో 2,614 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇక, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 31,187 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా... ఇప్పటి వరకు చేసిన కరోనా టెస్ట్ల సంఖ్య 72,15,785కు చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ