నేడు ప్రవాసీ భారతీయ దివస్
- January 09, 2021విశ్వవ్యాప్తంగా గొప్పవారి ‘జయంతులు ‘వర్ధంతులు’ జరపడం ఆనవాయితీ.ఎందుకంటే వారుచేసిన కృషిని, త్యాగాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ఆచరించవలె ననే ఒక మంచి సంకల్పమే దానికి కారణం.
అలాగే ఒక మంచి సందర్భాన్ని కూడా ఒక ప్రత్యేక దినంగా జరపడం వల్ల కూడా ఆ సంఘటనకు ప్రాధాన్యత కల్పిస్తూ దానికి సంబంధించిన కార్యమ్రాన్ని నిర్వహించడం కూడా ఆనవాయితీగా మారింది. ఈ రోజుకు కూడా అలాంటి ప్రత్యేకత ఉంది.
"1915వ సంవత్సరం జనవరి 9వ తేదీన ‘మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగివచ్చిన రోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 9ని ప్రవాసీ భారతీయ దివస్గా జరుపుకుంటున్నాం."
ఇది 2003వ సంవత్సరం నుండి భారత ప్రభుత్వంచే ఘనంగా నిర్వహించబడుతుంది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయు లను ‘ప్రవాస భారతీయులు అని అంటారు. ఇంగ్లీషులో నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI) అనీ లేదా పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (PIO) అని కూడా పిలుస్తారు. వారు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వెలుపల నివసించే భారతీయ సంతతికి చెందిన లేదా భారతీయ మూలాలున్నవారని అర్థం.
"విదేశాంగ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకా రం3.3కోట్ల ప్రవాస భారతీయులున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవలస జనాభా లో 5.5కోట్లమంది లో భారతీయ మూలాలున్నవారే అత్యధికులు. దక్షిణాఫ్రికా దేశజనాభాలో మనవారు 2.4 శాతం, కెన్యా జనాభాలో 1.13 శాతం, సౌదీ అరేబియాలో 23.22 శాతం, నేపాల్లో 14.7 శాతం,యూఏఈ లో 42.1శాతం, మలేసియాలో 7.4 శాతం, శ్రీలంకలో 5.4 శాతం, ఇంగ్లాండ్లో 1.8 శాతం, సింగపూర్లో 8.3 శాతం,బహ్రెయిన్ లో 21 శాతం, ఇటలీలో 0.12 శాతం, కెనడాలో 4.02 శాతం ఇలా ప్రపంచం లో 150కిపైగా దేశాల్లో మనవారున్నారు."
1980వ సంవత్స రం తర్వాత నుండి సాఫ్ట్వేర్రంగం అనూహ్యంగా పైకెగసింది. అమెరికా లో జరిగిన ఆర్థికాభివృద్ధి చాలామంది భారతీయులను ఆకర్షించింది.
అలాగే గల్ఫ్ దేశాల్లో పెట్రోలు బయల్పడటం, మరిన్నిదేశాలు ఆర్థికాభివృద్ధిని సాధించడంవల్ల అనేక మంది భారతీయులు ఆయా దేశాలకు వలసవెళ్లారు. వివిధ కారణా లవల్ల ఇలా వలస వెళ్లినవారు, ఆయాదేశాల్లో స్థిరపడిన భారత సంతతి వారు అందరూకలిసి దాదాపు 33మిలియన్ల వరకూ వివిధ దేశాల్లో స్థిరపడ్డారు.
ప్రస్తుతం వారిలో చాలామంది భారతీయులను ఈ దేశ అభివృద్ధిలో భాగస్వా ములుగా చేసి మన దేశాభివృద్ధికి వారిని ఉపయోగించుకో వాల్సిన అవసరం ఉంది.ప్రపంచంలోనే అత్యధిక ప్రవాసీలు భారత్కు చెందిన వారే.ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ప్రవాసీలు ప్రత్యే కంగా తెలుగు సంఘాలుగా ఏర్పడి మన ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు