యువతను తీవ్రవాదం నుంచి రక్షించాలి
- February 22, 2016
బహ్రెయిన్లో యువతను తీవ్రవాదం నుంచి రక్షించాల్సి ఉందని ఇన్ఫర్మేషన్ మరియు పార్లమెంట్ ఎఫైర్స్ మినిస్టర్ ఇసా అబ్దుల్ రహమాన్ అల్ హమ్మాదీ చెప్పారు. యువతను పెడతోవలో నడిపించేందుకు తీవ్రవాద సంస్థలు, అసాంఘీక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. 14 నుంచి 18 ఏళ్ళ వయసున్న వారు విదేశాలకు వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు వారిని జాగ్రత్తగా పరిశీలించాలనీ, వీరినే ఎక్కువగా తీవ్రవాదులు ఫోకస్ చేస్తున్నారని అబ్దుల్ రహమాన్ వెల్లడించారు. పార్టీలు, కుటుంబం, కమ్యూనిటీ ఇలాంటి వారి పట్ల పూర్తిస్థాయి అవగాహనతో ఉండాలని, సమాజం పట్ల బాధ్యతను వారికి నేర్పించాలని కోరారు అబ్దుల్ రెహమాన్. తీవ్రవాద సంస్థల్లో చేరుతున్న బహ్రెయినీ యువత శాతం మిగతా దేశాలతో పోల్చితే తక్కువేనని అన్నారు. అయినప్పటికీ ఇంకా జాగ్రత్తగా యువతను చెడు మార్గంలోకి వెళ్ళకుండా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







