ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు
- February 22, 2016
భారత దేశ పురోభివృద్దిని, ప్రజా సంక్షేమాన్ని నిర్ణయించే బడ్జెట్ 2016-17 సమావేశాలు పార్లమెంట్ లో నేడు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం అఖిల పక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశాలు సజావుగా సాగాలని, ఆందోళనల వల్ల క్వశ్చన్ అవర్ నష్టపోకుండా చూడాలంటూ పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని తెలిపారు. రిజర్వేషన్ల వ్యవస్థ, జేఎన్యూ వివాదం నేపథ్యంలో వర్సీటీల నిర్వాహన్పై చర్చించాలంటూ విపక్షాలు కోరాయని తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ సెంట్రల్ హాల్లో ఉదయం 11 గంటలకు ప్రసంగించనున్నారు. బుధవారం 25న రైల్వే బడ్జెట్ను మంత్రి సురేశ్ ప్రభు పార్లమెంటుకు సమర్పించనున్నారు.26న ఆర్థిక సర్వేను, 29వ తేదీన సాధారణ బడ్జెట్ను ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ సమర్పించనున్నారు. వచ్చే వారం లోక్ సభ లో చర్చించాల్సిన అంశాలపై ఈ రోజు మధ్యాహ్నం జరిగే బీఏసీసమావేశంలో అజెండా రూపొందిస్తామని తెలిపారు.ఈ సమావేశాల్లో మొత్తం 74 బిల్లులపై చర్చ జరుగనుంది. ఇందులో 62 శాసనాలకు సంబంధించినవికాగా, 12 మాత్రం ద్రవ్య సంబంధమైనవి. కొత్తగా నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం రాజ్యసభలో పెండింగ్లో ఉన్న 11 బిల్లులపైనా చర్చను చేపట్టనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







