దోహాలో త్వరలోనే ఎంబసీ కార్యాలయం పునరుద్ధరణ...సౌదీ ప్రకటన
- January 17, 2021
రియాద్:దోహాలో త్వరలోనే రాయబార కార్యాలయాన్ని రీఓపెన్ చేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. అవసరమైన చర్యలు పూర్తి అయిన వెంటనే కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభిస్తామని సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ వెల్లడించారు. అల్ ఉలా ఒప్పందం తర్వాత తీసుకుంటున్న సానుకూల నిర్ణయాల్లో భాగంగా రాయబార కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఖతార్ తో జోర్డాన్ విదేశాంగ మంత్రి అయ్మాన్ సఫాది తో కలిసి ఆయన రియాద్ ఈ ప్రకటన చేశారు. పాలస్తీనా వివాదానికి సమగ్ర పరిష్కారం పొందాల్సిన అవసరాన్ని సౌదీ మంత్రి పునరుద్ఘాటించారు. ఇదిలాఉంటే..జోర్డాన్ మంత్రి మాట్లాడుతూ...సౌదీతో మైత్రి చారిత్రాత్మకమైనది అభివర్ణించారు. ఆర్ధిక సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ మైత్రి దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే సౌదీపై హౌతి మిలిషియా దాడి ప్రయత్నాలను సఫాది ఖండించారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







