దోహాలో త్వరలోనే ఎంబసీ కార్యాలయం పునరుద్ధరణ...సౌదీ ప్రకటన
- January 17, 2021
రియాద్:దోహాలో త్వరలోనే రాయబార కార్యాలయాన్ని రీఓపెన్ చేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. అవసరమైన చర్యలు పూర్తి అయిన వెంటనే కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభిస్తామని సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ వెల్లడించారు. అల్ ఉలా ఒప్పందం తర్వాత తీసుకుంటున్న సానుకూల నిర్ణయాల్లో భాగంగా రాయబార కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఖతార్ తో జోర్డాన్ విదేశాంగ మంత్రి అయ్మాన్ సఫాది తో కలిసి ఆయన రియాద్ ఈ ప్రకటన చేశారు. పాలస్తీనా వివాదానికి సమగ్ర పరిష్కారం పొందాల్సిన అవసరాన్ని సౌదీ మంత్రి పునరుద్ఘాటించారు. ఇదిలాఉంటే..జోర్డాన్ మంత్రి మాట్లాడుతూ...సౌదీతో మైత్రి చారిత్రాత్మకమైనది అభివర్ణించారు. ఆర్ధిక సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ మైత్రి దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే సౌదీపై హౌతి మిలిషియా దాడి ప్రయత్నాలను సఫాది ఖండించారు.
తాజా వార్తలు
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!







