కోవిడ్ ఎఫెక్ట్...అబుధాబిలో ఎంట్రీకి కొత్త మార్గనిర్దేశకాలు జారీ
- January 17, 2021
అబుధాబి:ఇతర దేశాలతో పాటు దేశీయంగా కూడా అబుధాబిలోకి ఎంట్రీ అయ్యే ప్రయాణికుల కోసం కోత్త మార్గనిర్దేశకాలు జారీ చేసింది అబుధాబి క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఆదివారం(జనవరి 17) నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి ఎవరైనా అబుధాబికి ప్రయాణించాలంటే...ప్రయాణానికి ముందు 48 గంటల్లో కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అబుధాబి అధికారులకు పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ లేదా డీపీఐ టెస్ట్ రిపోర్ట్ ఖచ్చితంగా చూపించాలి. అయితే..గతంలో ఈ గడువు 72 గంటలుగా ఉండేది. కానీ, అబుధాబి అధికారులు గడువును 48 గంటలకు కుదించారు. అలాగే అబుధాబిలో నాలుగు రోజులు ఉండే వారు...నాలుగో రోజున ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి...ఒకవేళ 8 రోజులు ఉంటే...ఎనిమిదవ రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని వెల్లడించింది. అబుధాబిలోకి అడుగుపెట్టిన రోజును తొలి రోజుగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ నిబంధనలు యూఏఈలోని అన్ని ప్రాంతాల పౌరులు, ప్రవాసీయులకు వర్తిస్తుంది. అలాగే అబుధాబిలో ఉండే వారు ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చినా..నిబంధనల నుంచి మినహాయింపు ఉండదనే విషయం గుర్తుంచుకోవాలని అధికారులు సూచించారు. అయితే..వాక్సినేషన్ లో పాల్గొన్నవారు..వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వాలంటీర్లకు మాత్రం ఈ కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







