మోటార్ వాహనాల మార్గాలలో పెరిగిన కనీస వేగ పరిమితి
- February 23, 2016
యు.ఎ.ఇ. లో, ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు మోటార్ వాహనాలకు కేటాయించిన దారులలో కనీస వేగాన్ని
పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఇటీవల ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్ జరిపిన సమావేశంలో ఈ
పెంపుదలను ఆమోదించారు. రహదారి అంచులో కనిష్ట మరియు గరిష్ట వేగ పరిమితుల మధ్య భారీ వత్యాసం ఉన్నట్లు వారు కనుగొన్నారు, మండలి అధ్యక్షుడు, అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ దుబాయ్ పోలీస్ మేజర్ జనెరల్ మొహమ్మద్ అల్ జాఫిన్ ' ఏమరాట్ అల్ యొఉమ్ ' దినపత్రిక కు తెలిపారు. పైన పేర్కొన్న నిర్ణయానికి ప్రభావితం కాబోయే షేక్ జాయెద్ రోడ్ లో, కనీస వేగ పరిమితి ప్రస్తుతం గంటకు 60 కిలోమీటర్లు ఉందని, ఇది ఈ మార్గంలో చాల తక్కువ వేగమని పేర్కొంటూ, కనిష్ట మరియు గరిష్ట వేగ పరిమితుల మధ్య మార్జిన్ గతంలో గంటకు 20 కిలోమీటర్ల వేగం మించకూదదనే నిబంధన ఉండేదని చెప్పారు. కాగా ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం షేక్ జాయెద్ రోడ్ పై వాహనాల కనీస వేగ పరిమితి గంటకు 100 కిలోమీటర్లు ఉండాలి. అత్యధిక శాతం మంది డ్రైవర్ లు గంటకు 60 కిలోమీటర్లు వెళ్ళాల్సిన రోడ్లపై గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని , దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీకు కారణమవుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









