మోటార్ వాహనాల మార్గాలలో పెరిగిన కనీస వేగ పరిమితి
- February 23, 2016
యు.ఎ.ఇ. లో, ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు మోటార్ వాహనాలకు కేటాయించిన దారులలో కనీస వేగాన్ని
పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఇటీవల ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్ జరిపిన సమావేశంలో ఈ
పెంపుదలను ఆమోదించారు. రహదారి అంచులో కనిష్ట మరియు గరిష్ట వేగ పరిమితుల మధ్య భారీ వత్యాసం ఉన్నట్లు వారు కనుగొన్నారు, మండలి అధ్యక్షుడు, అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ దుబాయ్ పోలీస్ మేజర్ జనెరల్ మొహమ్మద్ అల్ జాఫిన్ ' ఏమరాట్ అల్ యొఉమ్ ' దినపత్రిక కు తెలిపారు. పైన పేర్కొన్న నిర్ణయానికి ప్రభావితం కాబోయే షేక్ జాయెద్ రోడ్ లో, కనీస వేగ పరిమితి ప్రస్తుతం గంటకు 60 కిలోమీటర్లు ఉందని, ఇది ఈ మార్గంలో చాల తక్కువ వేగమని పేర్కొంటూ, కనిష్ట మరియు గరిష్ట వేగ పరిమితుల మధ్య మార్జిన్ గతంలో గంటకు 20 కిలోమీటర్ల వేగం మించకూదదనే నిబంధన ఉండేదని చెప్పారు. కాగా ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం షేక్ జాయెద్ రోడ్ పై వాహనాల కనీస వేగ పరిమితి గంటకు 100 కిలోమీటర్లు ఉండాలి. అత్యధిక శాతం మంది డ్రైవర్ లు గంటకు 60 కిలోమీటర్లు వెళ్ళాల్సిన రోడ్లపై గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని , దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీకు కారణమవుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







